ప్రొద్దుటూరు అమృతనగర్కు చెందిన బొమ్మిశెట్టి భవానీ మంగళవారం పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. పోలీసులు జోక్యం చేసుకొని మహిళలను అక్కడ నుంచి తీసుకువెళ్లారు. అమృతనగర్లో కొత్తపల్లె మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలాలు కబ్జా అయ్యాయన్నారు. తన కుమారునిపై ఎమ్మార్వో పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు.




