ఉదయగిరి నియోజకవర్గంలో “జీరో పావర్టీ – P4 MBK 10-20” కార్యక్రమం ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా అమలు చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం సందర్భంగా వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, బంగారు కుటుంబాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమం పురోగతి, సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లైవ్ సందేశాన్ని వీక్షించారు. ఆయన ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు తెలియజేస్తూ, పేదరిక నిర్మూలన దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే కార్యక్రమంలో విశేష సేవలు అందించిన మార్గదర్శులను సన్మానించి ప్రశంసా పత్రాలు (సర్టిఫికెట్లు) అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, “జీరో పావర్టీ” లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా కార్యక్రమాన్ని అమలు చేస్తామని తెలిపారు.
స్వర్ణాంధ్ర 2047 విజన్ను సాధించేందుకు ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.



