శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్–ఊరందూరు ఆర్చ్ సమీపంలో నివసిస్తున్న గుణభూషనమ్మ (80) గృహ సమస్యపై వినుత కోటా స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. గత 70 సంవత్సరాలుగా నివాసముంటున్న తమ ఇల్లు దెబ్బతినడంతో మరమ్మతులు చేసి రేకుల షెడ్ ఏర్పాటు చేసుకోవడానికి మునిసిపల్ కమిషనర్ను పలుమార్లు సంప్రదించినప్పటికీ ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదని గుణభూషనమ్మ వాపోయారు. కార్యాలయంలో అవమానకరంగా ప్రవర్తించడంతో పాటు ఇల్లు కూల్చివేస్తామని బెదిరింపులు కూడా చేస్తున్నారని తెలిపారు. ఈ అంశంపై స్పందించిన వినుత కోటా, చట్టపరమైన అనుమతులు లేకుండా ఎవరూ బలవంతంగా ఇల్లు కూల్చే అధికారం లేదని స్పష్టం చేశారు. “అప్రూవల్ ఇవ్వవద్దు” అనే ఆదేశాలు ఉన్నాయని మునిసిపల్ సిబ్బంది చెప్పడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. గుణభూషనమ్మ మనవడు కావలి శివకుమార్ జనసేన పార్టీకి చెందినవాడని, రాజకీయ కారణాలతో కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అవసరమైన పత్రాలు సమర్పించినప్పటికీ అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమని విమర్శించారు. మునిసిపల్ కమిషనర్పై ప్రజల నుండి అవినీతి, ఇబ్బందుల ఆరోపణలు తరచూ వస్తున్నాయని, ఈ విషయంపై ఇప్పటికే పలు వినతులు అందినట్లు తెలిపారు. సమస్యను ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేలా చూస్తామని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లతో జనసేన మద్దతుదారులను ఇబ్బంది పెడితే ఊరుకోబోమని హెచ్చరించిన ఆమె, గుణభూషనమ్మకు తక్షణమే అనుమతి ఇవ్వకపోతే మునిసిపల్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.

వృద్ధురాలి ఇల్లు సమస్యపై వినుత కోటా స్పందన – అనుమతులు ఇవ్వకపోతే ఆందోళన హెచ్చరిక”
శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్–ఊరందూరు ఆర్చ్ సమీపంలో నివసిస్తున్న గుణభూషనమ్మ (80) గృహ సమస్యపై వినుత కోటా స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. గత 70 సంవత్సరాలుగా నివాసముంటున్న తమ ఇల్లు దెబ్బతినడంతో మరమ్మతులు చేసి రేకుల షెడ్ ఏర్పాటు చేసుకోవడానికి మునిసిపల్ కమిషనర్ను పలుమార్లు సంప్రదించినప్పటికీ ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదని గుణభూషనమ్మ వాపోయారు. కార్యాలయంలో అవమానకరంగా ప్రవర్తించడంతో పాటు ఇల్లు కూల్చివేస్తామని బెదిరింపులు కూడా చేస్తున్నారని తెలిపారు. ఈ అంశంపై స్పందించిన వినుత కోటా, చట్టపరమైన అనుమతులు లేకుండా ఎవరూ బలవంతంగా ఇల్లు కూల్చే అధికారం లేదని స్పష్టం చేశారు. “అప్రూవల్ ఇవ్వవద్దు” అనే ఆదేశాలు ఉన్నాయని మునిసిపల్ సిబ్బంది చెప్పడం అనుమానాస్పదమని పేర్కొన్నారు. గుణభూషనమ్మ మనవడు కావలి శివకుమార్ జనసేన పార్టీకి చెందినవాడని, రాజకీయ కారణాలతో కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అవసరమైన పత్రాలు సమర్పించినప్పటికీ అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమని విమర్శించారు. మునిసిపల్ కమిషనర్పై ప్రజల నుండి అవినీతి, ఇబ్బందుల ఆరోపణలు తరచూ వస్తున్నాయని, ఈ విషయంపై ఇప్పటికే పలు వినతులు అందినట్లు తెలిపారు. సమస్యను ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేలా చూస్తామని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లతో జనసేన మద్దతుదారులను ఇబ్బంది పెడితే ఊరుకోబోమని హెచ్చరించిన ఆమె, గుణభూషనమ్మకు తక్షణమే అనుమతి ఇవ్వకపోతే మునిసిపల్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.

