Friday, 20 February 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో ‘జీరో లిట్టర్’ లక్ష్యంగా నేడు భారీ పారిశుధ్య డ్రైవ్
- తిరుపతి

శ్రీకాళహస్తిలో ‘జీరో లిట్టర్’ లక్ష్యంగా నేడు భారీ పారిశుధ్య డ్రైవ్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తి పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మునిసిపాలిటీ చేపట్టిన ‘జీరో లిట్టర్ గవర్నెన్స్’ కార్యక్రమాన్ని నేడు నిర్వహిస్తునంరు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన భక్తులు భారీగా పాల్గొన్న గిరి ప్రదక్షిణ మార్గంలోని పరిసరాలను పారిశుధ్య సిబ్బంది యుద్ధప్రాతిపదికన శుభ్రం చేయనున్నారు. మునిసిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు నేడు పారిశుధ్య సిబ్బంది, మెప్మా సిబ్బంది అందరూ కలిసి సమన్వయంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. గిరి ప్రదక్షిణ మార్గానికి ఆనుకుని ఉన్న కీలక ప్రాంతాలైన కైలాసగిరి కాలనీ, టైలర్స్ కాలనీ, రాజీవ్‌నగర్,టిడ్కో (TIDCO) హౌసెస్ వంటి ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించి ‘లిటరింగ్’ (చెత్త వేయడం) నివారణపై స్థానికులకు అవగాహన కల్పిస్తూనే, క్షేత్రస్థాయిలో సిబ్బంది శ్రమదానం చేపడతారు. ఇటీవలే ప్రభుత్వం రూ. 10 కోట్ల వ్యయంతో 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని అభివృద్ధి చేసిన నేపథ్యంలో ఆ మార్గం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని మునిసిపాలిటీ ఈ నిర్ణయం తీసుకుంది. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు విడిచివెళ్లిన వ్యర్థాలను వెంటనే తొలగించడం ద్వారా ప్రజలకు అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పట్టణ ప్రజలు కూడా ఈ ‘జీరో లిట్టర్’ నినాదంలో భాగస్వాములు కావాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా మునిసిపాలిటీకి సహకరించాలని అధికారులు కోరారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తి పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మునిసిపాలిటీ చేపట్టిన ‘జీరో లిట్టర్ గవర్నెన్స్’ కార్యక్రమాన్ని నేడు నిర్వహిస్తునంరు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన భక్తులు భారీగా పాల్గొన్న గిరి ప్రదక్షిణ మార్గంలోని పరిసరాలను పారిశుధ్య సిబ్బంది యుద్ధప్రాతిపదికన శుభ్రం చేయనున్నారు. మునిసిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు నేడు పారిశుధ్య సిబ్బంది, మెప్మా సిబ్బంది అందరూ కలిసి సమన్వయంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. గిరి ప్రదక్షిణ మార్గానికి ఆనుకుని ఉన్న కీలక ప్రాంతాలైన కైలాసగిరి కాలనీ, టైలర్స్ కాలనీ, రాజీవ్‌నగర్,టిడ్కో (TIDCO) హౌసెస్ వంటి ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించి ‘లిటరింగ్’ (చెత్త వేయడం) నివారణపై స్థానికులకు అవగాహన కల్పిస్తూనే, క్షేత్రస్థాయిలో సిబ్బంది శ్రమదానం చేపడతారు. ఇటీవలే ప్రభుత్వం రూ. 10 కోట్ల వ్యయంతో 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని అభివృద్ధి చేసిన నేపథ్యంలో ఆ మార్గం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని మునిసిపాలిటీ ఈ నిర్ణయం తీసుకుంది. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు విడిచివెళ్లిన వ్యర్థాలను వెంటనే తొలగించడం ద్వారా ప్రజలకు అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పట్టణ ప్రజలు కూడా ఈ ‘జీరో లిట్టర్’ నినాదంలో భాగస్వాములు కావాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా మునిసిపాలిటీకి సహకరించాలని అధికారులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.