2026 ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్కు బంగ్లాదేశ్ జట్టు తప్పుకుంది. భారత్లో తమకు భద్రతా ముప్పు ఉందని పేర్కొంటూ తమ మ్యాచ్లను పూర్తిగా శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునేందుకు ఐసీసీ ఇచ్చిన 24 గంటల గడువును కూడా బంగ్లాదేశ్ అంగీకరించలేదు. ఫలితంగా ఐసీసీ నిబంధనల ప్రకారం బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టుకు ఈ మెగా టోర్నీలో పాల్గొనే అవకాశం లభించింది. ఈ పరిణామం క్రికెట్ ప్రపంచంలో సంచలనం రేపింది.
Uploaded Video:



