ఖమ్మం జనవరి
(పున్నమి దినపత్రిక జిల్లా ప్రతినిధి)
ఈరోజు సత్తుపల్లిలోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఖమ్మం జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన అక్బర్, ఉమాదేవి గార్లు తమ అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మిరియాల రామకృష్ణ గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అలాగే సత్తుపల్లి మున్సిపాలిటీలో కూడా మొత్తం 23కి 23 వార్డులలో జనసేన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతుందని ప్రకటించారు. కార్యకర్తలంతా ఐక్యంగా, సమన్వయంతో పనిచేసి జనసేన పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆళ్ళ నరేష్, సింగపోగు అప్పారావు, వలపుల నాగబాబు, కంచర్ల గోపాలరావు, మహమ్మద్ సైఫ్ అలీ ఖాన్ తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



