అనకాపల్లి జిల్లా జనవరి 21 పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ : యలమంచిలి మండలం సోమన్నపాలెం గ్రామం వద్ద బుధవారం రాత్రి 08.55 గంటల సమయంలో తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది. పులపర్తి నుంచి అచ్యుతాపురం వెళ్తున్న AP 39 TF 6938 నంబర్ గల బ్రాండెక్స్ కంపెనీకి చెందిన SML ట్రావెల్స్ బస్, ఎదురుగా వస్తున్న AP 39 FE 7917 నంబర్ మోటార్ సైకిల్ను ఢీకొంది. ఈ ఘటనలో యొకోహోమా టైర్స్ కంపెనీలో పనిచేస్తున్న గింజల తాత అబ్బాయి (S/o బాబ్జి) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు.



