కామారెడ్డి, 18 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, గిద్ద మైసమ్మ పరిసరాలలో ఫోటోగ్రాఫర్ల యూనియన్ ఆధ్వ ర్యంలో ఘన సన్మాన సమావేశం నిర్వహించారు. ఉప్పల్వాయి గ్రామ సర్పంచ్గా గెలిచిన శివరాణి విజయాన్ని ఆమె భర్త, ఫోటోగ్రాఫర్ రాజేందర్కు యూనియన్ సభ్యులు అభినందాలు తెలిపారు. ఈ సందర్భంగా ఫోటో యూనియన్ అధ్యక్షుడు మధు మాట్లాడుతూ,ఉప్పల్వాయి గ్రామానికి చెందిన రాజేందర్ భార్య శివరాణి సర్పంచ్గా గెలిచిన సందర్భంగా యూనియన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించామని తెలిపారు.యూని యన్ సభ్యుడైన రాజేందర్ను అభినందిస్తూ, ఫోటోగ్రాఫర్ల సంఘాన్ని మరింత బలోపేతం చేసేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యూనియన్ సెక్రటరీ రజనీకాంత్, శేఖర్, కిరణ్, శివరాజ్, నరేష్, క్రాంతి, వడ్ల కార్తీక్, నవీన్ తదితరులు పాల్గొని, గ్రామంలోని ఫోటోగ్రాఫర్లు, స్థానికులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.


