ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలం కోదండరాంపురం చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో యాడాది పండగ సందర్భంగా గొబ్బెమ్మను వైభవంగా కొలువు తీర్చారు. మేళా తాళాలు, డప్పు వాయిద్యాల నడుమ సాయంత్రం పుట్ట మట్టిని తెచ్చి గొబ్బెమ్మను తయారు చేశారు. మూడు రోజుల పాటు గొబ్బెమ్మను కొలువు తీర్చి గొబ్బి పాటలు పాడుతూ గొబ్బిలు తట్టారు. ఈ సందర్భంగా పొంగళ్లు పొంగించి పండగను ఘనంగా జరుపుకున్నారు. అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

వైభవంగా గొబ్బెమ్మ విగ్రహ ప్రతిష్ట.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలం కోదండరాంపురం చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో యాడాది పండగ సందర్భంగా గొబ్బెమ్మను వైభవంగా కొలువు తీర్చారు. మేళా తాళాలు, డప్పు వాయిద్యాల నడుమ సాయంత్రం పుట్ట మట్టిని తెచ్చి గొబ్బెమ్మను తయారు చేశారు. మూడు రోజుల పాటు గొబ్బెమ్మను కొలువు తీర్చి గొబ్బి పాటలు పాడుతూ గొబ్బిలు తట్టారు. ఈ సందర్భంగా పొంగళ్లు పొంగించి పండగను ఘనంగా జరుపుకున్నారు. అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

