ఓబులవారిపల్లి మండలం వెంకటేశాపురంలో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొన్నారు. అర్హులైన రైతులకు రాజ్యముద్రతో కూడిన పట్టాదార్ పాస్పుస్తకాలను పంపిణీ చేశారు. గత పాలనలో రైతు హక్కులను నిర్లక్ష్యం చేశారని విమర్శించిన అరవ శ్రీధర్, ప్రస్తుత ప్రభుత్వం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. ఫిర్యాదు చేసిన నెలలోపే పరిష్కారం అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.

రైతు హక్కులకు భరోసా: ‘మీ భూమి–మీ హక్కు’లో అరవ శ్రీధర్
ఓబులవారిపల్లి మండలం వెంకటేశాపురంలో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొన్నారు. అర్హులైన రైతులకు రాజ్యముద్రతో కూడిన పట్టాదార్ పాస్పుస్తకాలను పంపిణీ చేశారు. గత పాలనలో రైతు హక్కులను నిర్లక్ష్యం చేశారని విమర్శించిన అరవ శ్రీధర్, ప్రస్తుత ప్రభుత్వం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. ఫిర్యాదు చేసిన నెలలోపే పరిష్కారం అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.

