మిరుదొడ్డి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు.
యూరియా వస్తుందని తెలవడంతో భారీగా తరలివచ్చిన రైతన్నలు.
యూరియా కోసం ఓ షాప్ ముందు భారీగా లైన్ కట్టిన అన్నదాతలు.
వచ్చిన యూరియా అందరికీ సరిపోక
నిరాశకు గురైన రైతన్నలు.
పున్నమి ప్రతినిధి మిరుదొడ్డి మండలం
మల్లేశం .
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రానికి ఉదయం 6 గంటల నుంచి ఓ ఫర్టిలైజర్ షాప్ వద్ద రైతులు యూరియా కోసం లైన్లో నిల్చొని ఉన్నారు. వ్యవసాయ అధికారులు టోకెన్లు ఇచ్చిన స్టాక్ లేదని చెప్పడంతో రైతులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు వింత నిబంధనాలతో రైతులను ఇబ్బంది పెడుతూ యూరియా కొరత నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరా చేసేందుకు ఇటీవల ఫర్టిలైజర్ యాప్ తీసుకు రావడంతో గందరగోళంలో పడిన రాష్ట్ర రైతాంగం.
అయితే ఈ యాప్ లో యూరియా బుక్ చేసుకున్న 24 గంటల్లోనే తీసుకోకపోతే మళ్లీ 15 రోజుల వరకు యూరియా బుక్ చేసుకునే అవకాశం ఉండదనే నిబంధనలు తీసుకురావడంతో అసహనం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు.
యాప్ లో యూరియా బుక్ చేసుకునేందుకు ఆధార్ కార్డ్ వివరాలు అడగడంతో కౌలు రైతులకు. రైతుబంధు నిధులు వేస్తారేమో అని ఆందోళనలో ఉన్న భూ యజమానులు.
ఈ నేపథ్యంలో తమకు భూమినీ కౌలికి ఇచ్చేందుకు యజమానులు వెనకాడుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్న కౌలి రైతులు.
యూరియా తీసుకునే లిమిట్ పెట్టిన ప్రభుత్వం. పైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా ఈ షాపుల్లో లేని యూరియా యాప్ లో ఎలా అని అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా రైతన్నల పైన కక్షపూరిత వైఖరి మాని అన్నదాతలకు యూరియా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని అన్నదాతలు డిమాండ్ చేయడం జరిగింది.


