*కలకలం సృష్టించిన అన్న,తముళ్ల,జంట హత్యలు..వ్యక్తిగతమా.!రాజకీయమా!అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు*
పల్నాడు జిల్లా
దుర్గి (M) అడిగొప్పలలో ఆదివారం రాత్రి జరిగిన
శ్రీరామమూర్తి, కొత్త హనుమంతరావు అనే సోదరుల
జంట హత్యలు గ్రామస్తులను భయబ్రాంతులకు గురిచేసాయి.
రాజకీయమా, వ్యక్తిగతమా, గ్రూపుల
ఆధిపత్యం కోసమా అనే కోణాలలో పోలీసులు
దర్యాప్తును ప్రారంభించారు.
క్లూస్ టీమ్ని రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.
పోలీస్ అధికారులు
మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.
జంటహత్యలు ఎందుకు జరిగాయి, గత కొన్నినెలల్లో
గ్రామంలో నెలకొన్న పరిస్థితులు ఆరా తీసి, పికెట్ ఏర్పాటు చేశారు.

