కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని 20, 22 డివిజన్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం అందించేందుకు బీటెక్ రవి గారి ఆధ్వర్యంలో ఐదు రూపాయలకు శుద్ధి చేసిన మంచినీటిని ప్రజలకు అందించే కార్యక్రమం లో భాగంగా మూడు వాటర్ ఆటోలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు & కడప జిల్లా టిడిపి అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన ప్రాథమిక వసతులలో తాగునీరు అత్యంత కీలకమన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఈ కార్యక్రమం ఉపయోగకరమని అభినందించారు.


