Wednesday, 25 March 2026
  • Home  
  • చిన్నారి ప్రాణం కాపాడిన జర్నలిస్టు సీఎం నాగేంద్ర
- Blog

చిన్నారి ప్రాణం కాపాడిన జర్నలిస్టు సీఎం నాగేంద్ర

నంద్యాల పట్టణంలోని చెరువు కట్ట వద్ద గురువారం సాయంత్రం సంభవించిన ఘటన ఒక చిన్నారి ప్రాణాన్ని తృటిలో కాపాడింది. సకాలంలో స్పందించిన జర్నలిస్టు జాగ్రత్తతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే, స్థానిక చెరువు కట్టదగ్గర ముగ్గురు చిన్న పిల్లలు (సుమారు 5-6 ఏళ్ల వయసు) ఆటపాటలతో స్నానానికి దిగారు. కొద్ది సేపటికే ఇద్దరు పిల్లలు అక్కడి నుంచి వెళ్లిపోయి, ఒక బాలుడు ఒంటరిగా నీటిలో మిగిలిపోయాడు. ఆ సమయాన అటుగా వెళ్తున్న ‘న్యాయం’ పత్రిక రిపోర్టర్ సీఎం నాగేంద్ర బాలుడి పరిస్థితిని గమనించారు. వెంటనే బాలుడి వద్దకు చేరుకుని అతన్ని బయటకు తెచ్చి సురక్షిత స్థలానికి తరలించారు. నీటిలో తడిసి వణుకుతున్న చిన్నారిని గమనించిన నాగేంద్ర, సమీపంలో ఉన్న వారి స్నేహితులను పిలిపించి బట్టలు తెప్పించి ఆ బాలుడికి వేసి చల్లబడకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం వెంటనే వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే కానిస్టేబుల్ నాగన్న అక్కడికి చేరుకుని బాలుణ్ణి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్రమత్తంగా వ్యవహరించిన జర్నలిస్టు నాగేంద్ర తక్షణ ప్రతిస్పందనతో ఒక ప్రాణం రక్షించబడింది. ఈ ఘటన తల్లిదండ్రులకు మరొకసారి హెచ్చరికగా నిలిచింది. చిన్నారులను నీటిప్రాంతాల్లో లేదా రోడ్ల వద్ద ఒంటరిగా విడిచిపెట్టడం ప్రమాదకరమని అధికారులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం క్షణాల్లో సత్తువను తెగదెంపు చేయగలదని ఈ ఘటన స్పష్టంగా చాటి చెబుతోంది

నంద్యాల పట్టణంలోని చెరువు కట్ట వద్ద గురువారం సాయంత్రం సంభవించిన ఘటన ఒక చిన్నారి ప్రాణాన్ని తృటిలో కాపాడింది. సకాలంలో స్పందించిన జర్నలిస్టు జాగ్రత్తతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే, స్థానిక చెరువు కట్టదగ్గర ముగ్గురు చిన్న పిల్లలు (సుమారు 5-6 ఏళ్ల వయసు) ఆటపాటలతో స్నానానికి దిగారు. కొద్ది సేపటికే ఇద్దరు పిల్లలు అక్కడి నుంచి వెళ్లిపోయి, ఒక బాలుడు ఒంటరిగా నీటిలో మిగిలిపోయాడు. ఆ సమయాన అటుగా వెళ్తున్న ‘న్యాయం’ పత్రిక రిపోర్టర్ సీఎం నాగేంద్ర బాలుడి పరిస్థితిని గమనించారు. వెంటనే బాలుడి వద్దకు చేరుకుని అతన్ని బయటకు తెచ్చి సురక్షిత స్థలానికి తరలించారు. నీటిలో తడిసి వణుకుతున్న చిన్నారిని గమనించిన నాగేంద్ర, సమీపంలో ఉన్న వారి స్నేహితులను పిలిపించి బట్టలు తెప్పించి ఆ బాలుడికి వేసి చల్లబడకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం వెంటనే వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే కానిస్టేబుల్ నాగన్న అక్కడికి చేరుకుని బాలుణ్ణి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్రమత్తంగా వ్యవహరించిన జర్నలిస్టు నాగేంద్ర తక్షణ ప్రతిస్పందనతో ఒక ప్రాణం రక్షించబడింది. ఈ ఘటన తల్లిదండ్రులకు మరొకసారి హెచ్చరికగా నిలిచింది. చిన్నారులను నీటిప్రాంతాల్లో లేదా రోడ్ల వద్ద ఒంటరిగా విడిచిపెట్టడం ప్రమాదకరమని అధికారులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం క్షణాల్లో సత్తువను తెగదెంపు చేయగలదని ఈ ఘటన స్పష్టంగా చాటి చెబుతోంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.