( పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులు, సిపిఎం పార్టీ నాయకులు కామ్రేడ్ జోన్నలగడ్డ వెంకమరాజు గారి సతీమణి జోన్నలగడ్డ నర్మద అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం పార్టీకి, కుటుంబానికి తీరని లోటని సిపిఎం నేతలు తెలిపారు. నెల్లూరు జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి మరియు జిల్లా కమిటీ సభ్యులు ,మండల కమిటీ సభ్యులు కలిసి నర్మద మృతదేహానికి నివాళులర్పించారు. పార్టీ తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
*సిపిఎం పార్టీ నేతల సంతాప ప్రకటన*
కామ్రేడ్ జోన్నలగడ్డ వెంకమరాజు సతీమణి జోన్నలగడ్డ నర్మద అకాల మరణం చెందడంతో, సిపిఎం పార్టీ నేతలు ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖ్యంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు మోహన్రావు, అజయ్ కుమార్, గోగుల శ్రీనివాస్, మాదాల వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, కత్తి శ్రీనివాసులు, ముత్యాల గురునాథం, డాక్టర్ దత్తాత్రేయులు,డాక్టర్ రాజేశ్వరరావు, రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగలి పుల్లయ్య, మూలె వెంగయ్య, యుటిఎఫ్ నాయకులు బాబిరెడ్డి,పరం ధామయ్య, జనవిజ్ఞాన వేదిక నాయకులు మాదాల రాము, పోతంసెట్టి విద్యాచరణ్, న్యాయవాది ఐ.రాజా, నారా గోపాల్, ప్రజాశక్తి డెస్క్ ఇన్చార్జి ఎం.రమణయ్య, వరికూటి వేంకటరెడ్డి,జగన్నాథం, రామచంద్రరావు, జానా వెంకయ్య, మాజీ మండల అధ్యక్షుడు చంద్రమౌళి గారు తదితరులు పాల్గొని సంతాపం తెలిపారు.
నర్మద మరణానంతరం ఆమె కళ్ళని దానం చేసారు.


