కామారెడ్డి, 07నవంబర్, పున్నమి ప్రతినిధి
రామారెడ్డి పట్టణంలోని ఎస్.సి కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ పునరుద్ధరణకు సంబంధించిన రూ.40 లక్షల విలువగల అభివృద్ధి పనులకు శుక్రవారం ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ శంకుస్థాపన చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కాలనీలోని రోడ్లు దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసుల విజ్ఞప్తికి ఎమ్మెల్యే వెంటనే స్పందిస్తూ సిఆర్ఆర్ నిధుల ద్వారా నిదులు మంజూరు చేశారు. ఈ సందర్భం గా కాలనీవాసులు ఎమ్మెల్యేకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజల సమస్యలను గుర్తించి వేగంగా పరిష్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడిన ఎమ్మెల్యే మద న్ మోహన్ రామారెడ్డి మండలంలోని ప్రతి గ్రామం లో అభివృద్ధి పనులు దశల వారీగా జరుగుతున్నా యి. సీసీ రోడ్లు, గంగమ్మ వాగు పై వంతెన,రామాల య దేవస్థానం సౌందర్య వృద్ధి, కాలభైరవ స్వామి ఆలయ అభివృద్ధి వంటి పలు కార్యక్రమాలు త్వరితగతిన సాగుతున్నాయి. ప్రజల ఆశీర్వాదాల తో రామారెడ్డి అభివృద్ధి పథంలో ముందుకు వెళు తోంది” అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నేతలు, వివిధ హోదా లో ఉన్న ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.


