కామారెడ్డి, 04 నవంబర్ (పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా బీబీపేట్ గ్రామంలో వెలసిన శ్రీ కాళికాదేవి సమేత కమటేశ్వర స్వామి సహిత శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో పంచమ వార్షికోత్సవ మహోత్స వాలు నవంబర్ 8వ తేదీ శనివారం నుండి 10వ తేదీ సోమవారం వరకు వైభవంగా జరగనున్నా యి. ఈ ఉత్సవాలకు సిద్ధమవుతున్న దేవాలయ పరిసరాల్లో భక్తుల రాకపోకలతో పండుగ వాతావ రణం నెలకొననుంది.ఉత్సవాల కమిటీ సభ్యులు, విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ శుభకార్య క్రమాలు నిర్వహించబడనున్నాయని తెలిపారు. మూడు రోజులపాటు భక్తులకు తీర్థప్రసాద వితర ణ, హోమాలు, కళ్యాణోత్సవాలు, అన్నప్రసాదం వంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారని నిర్వా హకులు తెలిపారు.తేది 8 నవంబర్ ఉదయం సుప్రభాత సేవతో ఉత్సవా లు ప్రారంభమై, పంచా మృతాభిషేకం, గణపతి పూజ, పుణ్యాహవచనం, హోమాలు, మహానైవేద్యం కార్యక్రమాలు జరగను న్నాయి.నవంబర్ 9న ఆరుద్ర నక్షత్రయుక్త పుష్కర లగ్న మహా ముహూర్తంలో శ్రీ కాళికాదేవి సమేత కమటేశ్వర స్వామి కళ్యాణం, అలాగే శ్రీ గోవింద మాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం ఘనంగా జరగనుంది.అనంతరం పూర్ణాహుతి ముగిసిన తర్వాత అన్నప్రసాద వితరణ భక్తులకు అందించబడుతుంది.నవంబర్ 10న అమ్మవారి బోనాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ గురు మూర్తి ఆచారి, మంచోజు పూర్ణాచార్య బృందం తెలిపారు. వంగాల దేవి ప్రసాద్ ఆచారి, కొండ శివకుమార్ ఆచారి తదితరు లు వేదపారాయణం, హోమాలు నిర్వహించను న్నారు.దేవీదేవతల అను గ్రహం కోరుతూ భక్తులం దరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చా రు , ఈ పంచమ వార్షికోత్సవంలో పాల్గొని దైవ సన్నిధిలో ఆశీర్వాదాలు పొందవలని నిర్వాహకు లు తెలిపారు.


