– మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి
కామారెడ్డి, 02నవంబర్, (పున్నమి ప్రతినిధి) :
కాంగ్రెస్ ను నిలబెట్టిన నేతలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెసు పార్టీ ఆదర్శాల కోసం అడ్డుబడిన వారిలో షబ్బీర్ అలీ పేరును ముందు గా గుర్తించాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొ న్నారు.పార్టీ తీవ్ర సంక్షోభాల్లో ఉన్నప్పుడు సైతం అధిష్టానం పట్ల పూర్తి విశ్వాసంతో, స్వప్రయోజనా లను పక్కనబెట్టి పార్టీకోసం పని చేసిన నాయకుడి గా ఆయన ప్రజాదరణ పొందారు.పదవులకన్నా సిద్ధాంతమే పెద్దదిబీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఉపముఖ్య మంత్రి పదవి ఆఫర్ వచ్చినా, దానికి లోనుకాక కాంగ్రెసులోనే కొనసాగుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నివసించడంలో ఆయన అంకితభావం స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీకి ఎంతటి కష్ట కాలం వచ్చినా నిబద్ధతతో పోరాడిన నేతలకు, కనీస గౌరవమైన పదవులు ఇవ్వడం పార్టీ ఆరోగ్యానికి ఉపకరిస్తుందని మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి అభిప్రా యపడ్డారు.అంకితభావానికి గౌరవంనాయకుడి సేవలు గుర్తించకపోతే పార్టీ పనితీరుపైన ప్రజల్లో భ్రాంతి కలుగుతుందని, గతంలో శ్రమించిన వారిని గౌరవించడం ద్వారా రాజకీయ వ్యూహాన్ని బల పర్చుకోవచ్చు. పార్టీలో పదవి లేకున్నా, చివరి ఊపిరి వరకూ పనిచేస్తానని చెప్పిన నాయకుడు షబ్బీర్ అలీ అన్ని సమయా ల్లో యథాతథంగా నిలిచారన్న అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు.పార్టీ బలానికి ఆస్తివారు.అధికార, ప్రమాణాలపై నిలబడిన వారు, పార్టీ తరపున ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిన నేతలకు సక్రమంగా గౌరవం లభించాలి. పదికాలాలపాటు పార్టీ అధికా రంలో ఉండాలంటే ఎప్పటికప్పుడు కష్టసాధకుల ను గుర్తించాల్సిన అవసరాన్ని జిల్లా నాయకులు ప్రస్తావించారు. షబ్బీర్ అలీకి మంత్రి స్థానం ఇవ్వ డం ద్వారా ఈ అధ్యాయానికి మంచి న్యాయం జరగనుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.


