*CM రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి,ఎంపీ కడియం కావ్య గార్ల చిత్రపటానికి పాలభిషేకం చేసిన శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పోట్లపల్లి శ్రీధర్ రావు గారు*
*15 సంవత్సరాల నిరీక్షణ పొట్లపల్లి శ్రీధర్ రావు గారి కృషి వల్ల సాంక్షన్ అయిన R&B పంచాయతీరాజ్ శాఖ మరియు B.T ట్రైబల్ రోడ్లు*
ఈరోజు పల్లగుట్టలోని పొట్లపల్లి శ్రీధర్ రావు గారి ఆధ్వర్యంలో వారి నివాసం నందు R&B, పంచాయతీరాజ్ శాఖ, మరియు B.T ట్రైబల్ రోడ్స్ చిల్పూర్ మండలానికి మంజూరు చేసిన సందర్భంగా cm రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య గార్ల, చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 17.60 కోట్లతో పల్లగుట్ట క్రాస్ నుండి మల్లన్న గండి వరకు పల్లగుట్ట,కృష్ణాజి గూడెం,ఫతేపూర్, గార్లగడ్డ తండ గ్రామాల మీదిగా డబల్ రోడ్డు.
లింగంపల్లి నుండి అబ్దుల్ నాగరం వరకు 2.5
గోవర్ధనగిరి నుండి చిల్పూర్ వరకు14.52
చిన్న పెండ్యాల నుండి తరిగొప్పుల వరకు 46.03
రాజవరం నుండి కిమా తండ వరకు 104.34
ట్రైబల్ బిటి రోడ్స్
వాచ్య తండా 37.38
ఫకీర్ తాండ 37.32
SC,ST సబ్ ప్లాన్ 110 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కడియం శ్రీహరి గారు కృషి చేస్తున్నారని అన్నారు
*సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య,ఎమ్మెల్యే కడియం శ్రీహరి గార్లకు మరియు మంత్రులకు* ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
ఈ కార్యక్రమంలో భాగంగా చిల్పూర్ మండల ముఖ్య నాయకులు, దేవస్థానం డైరెక్టర్లు, మార్కెట్ డైరెక్టర్లు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసిలు,యువజన నాయకులు,కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


