రాష్ట్రానికి మొంథా తుపాన్ పొంచి ఉన్న నేపథ్యం లో వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రానున్న మూడు రోజుల్లో శ్రీకాళహస్తి పరిసరాల ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పట్టణం నందలి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి తెలిపారు.స్వర్ణముఖి నదిలో వరద నీర ఎక్కువగా ఉన్నందున పరిసర ప్రాంత ప్రజలు,పిల్లలు ఈతకు వెళ్లడం మరియు చేపలు పట్టడం వంటి చర్యలు చేయకూడదు అని సూచించారు.పాత మట్టి గోడల ఇండ్లలో ఎవరైనా ఉన్నట్లయితే వేరొక చోట నివాసం ఉండాలని వారు సూచించారు.ముఖ్యంగా ఉరుములు మెరుపులు సమయంలో చెట్ల కింద ఉండరాదని,కరెంటు తీగలు ఉన్న చోట బట్టలు తీయడానికి పైఅంతస్థుకు వెళ్లే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని,లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు.

వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. టూ టౌన్ సీఐ నాగార్జున రెడ్డి
రాష్ట్రానికి మొంథా తుపాన్ పొంచి ఉన్న నేపథ్యం లో వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రానున్న మూడు రోజుల్లో శ్రీకాళహస్తి పరిసరాల ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పట్టణం నందలి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి తెలిపారు.స్వర్ణముఖి నదిలో వరద నీర ఎక్కువగా ఉన్నందున పరిసర ప్రాంత ప్రజలు,పిల్లలు ఈతకు వెళ్లడం మరియు చేపలు పట్టడం వంటి చర్యలు చేయకూడదు అని సూచించారు.పాత మట్టి గోడల ఇండ్లలో ఎవరైనా ఉన్నట్లయితే వేరొక చోట నివాసం ఉండాలని వారు సూచించారు.ముఖ్యంగా ఉరుములు మెరుపులు సమయంలో చెట్ల కింద ఉండరాదని,కరెంటు తీగలు ఉన్న చోట బట్టలు తీయడానికి పైఅంతస్థుకు వెళ్లే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని,లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు.

