ఆహ్లాదకరమైన వాతావరణంలో వచ్చే నెల నవంబర్ 16, కార్తీక మాసం ఆఖరి ఆదివారం కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, సంఘ పెద్దలు పంతం నానాజీ గారు స్పష్టం చేశారు. స్థానిక ఆర్టీవో ఆఫీస్ రోడ్ లో గల శుభం కాపు కళ్యాణ మండపంలో సంఘ గౌరవ అధ్యక్షులు బసవా ప్రభాకర్ రావు గారు, ప్రధాన కార్యదర్శి చిట్నీడి శ్రీనివాస్ గార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీకమాస కాపు వన సమారాధన కమిటీ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి జీవితకాల సభ్యులు, కార్యవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు నాయకులు పాల్గొనాలి అని ఈ కార్తీక వన భోజన సమావేశంలో రాజకీయ ఉపన్యాసాలు ఉండకుండా చూడాలి అని పిలుపునిచ్చారు. సంఘ కార్యవర్గం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మార్పు చేయాలని నూతన కార్యవర్గం ఏర్పాటు చేసినట్లు అయితే నూతన ఆలోచనలు అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, సభ్యులు పాల్గొన్నారు.



