అనకాపల్లి (పున్నమి ప్రతినిధి) :
ఆటో కార్మికుల జనరల్ బాడీ సమావేశం ఈ రోజు అచ్చుతాపురంలో జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము, మండల కన్వీనర్ కూండ్రపునాయుడు మాట్లాడుతూ డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు జరిగే సిఐటియు ఆల్ ఇండియా మహాసభలో ఆటో, మోటార్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని మోటారు కార్మికులకు శిక్షలు, పెనాల్టీలు పెంచి స్వయం ఉపాధితో అప్పులు చేసి బ్రతుకుతున్న ఆటో కార్మికులకు శ్రీ శక్తి పథకంతో ఆటో కార్మికుల జీవితాలు నష్టపోతున్నాయని వీరికి సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు ఏర్పాటుచేసి మోటారు కార్మికులను ఆదుకోవాలని సిఐటి ఆల్ ఇండియా మహాసభ సందర్భంగా జరిగే బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువశక్తి ఆటో యూనియన్ అధ్యక్షులు డి చండీ, ఉపాధ్యక్షులు టి రాజు, కార్యదర్శి ఏ అప్పారావు, కోశాధికారి డి డి సన్నీబాబు, టివియస్ ప్రకాష్, గుమ్మెళ్ల గోవిందరావు, కారే త్రినాద్, మేరుగు అప్పలనాయుడు,దుర్గా, మురళి, కుమార్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.


