నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
మంగళవారం కనగల్ మండలం దొరపల్లిలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి ప్రారంభించారు రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి సహకరించాలని కలెక్టర్ కోరారు. రైతులు అకాల వర్షాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వర్షం సూచన ఉన్నందున ప్రతిరోజు ధాన్యంపై టార్పాలిన్ లు ఉంచాలని తెలిపారు. తగినంత తేమ శాతం వచ్చిన తర్వాతనే ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.


