Monday, 8 December 2025
  • Home  
  • శనేశ్వర స్వామికి తిలతైలా అభిషేక పూజలు…
- నాగర్‌కర్నూల్

శనేశ్వర స్వామికి తిలతైలా అభిషేక పూజలు…

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా అక్టోబర్ 11 శ్రీ విశ్వవసు సంవత్సరం ఆశ్విజ మాసం కృష్ణ పక్షం పంచమి శనివారం నాడు బీజినేపల్లి మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శనేశ్వర స్వామికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులచే తిలతైలా అభిషేకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి శనివారం నాడు ప్రత్యేకంగా తిల తైల అభిషేకాల పూజలు నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ ఈ మాసంలోభక్తి పూర్వకంగా స్వామివారిని కొలవడం ఎంతో విశేష ఫలితం అన్నారు.భక్తులు ప్రతి మాసంలో శనివారం నాడు అష్టమి, నవమి, త్రయోదశి, చతుర్దశి,అమావాస్య తిథులు ఉన్న రోజు శనేశ్వర స్వామిని పూజించిన విశేష ఫలితం ఉంటుందన్నారు.ఇక్కడ గోన బుద్ధారెడ్డి కాలం నాటి బ్రహ్మ సూత్రం గల పరమశివునికి ఈరోజు భక్తులచే రుద్రాభిషేక పూజలు,అర్చనలు,గణపతి, నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చనపూజలు భక్తులచే నిర్వహించారు.అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు,కమిటీ సభ్యులు రాజేష్, ప్రభాకరచారి,పుల్లయ్య, అడ్వకేట్ వీర శేఖర్ చారి, శ్రీకాంత్ రెడ్డి, ఆలయ ఆర్చకులు గవ్వమఠం శాంతి కుమార్, ఉమమహేశ్వర్,సిబ్బంది గోపాల్ రెడ్డి భక్తులు,మహిళలు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా అక్టోబర్ 11

శ్రీ విశ్వవసు సంవత్సరం ఆశ్విజ మాసం కృష్ణ పక్షం పంచమి శనివారం నాడు బీజినేపల్లి మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శనేశ్వర స్వామికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులచే తిలతైలా అభిషేకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి శనివారం నాడు ప్రత్యేకంగా తిల తైల అభిషేకాల పూజలు నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ ఈ మాసంలోభక్తి పూర్వకంగా స్వామివారిని కొలవడం ఎంతో విశేష ఫలితం అన్నారు.భక్తులు ప్రతి మాసంలో శనివారం నాడు అష్టమి, నవమి, త్రయోదశి, చతుర్దశి,అమావాస్య తిథులు ఉన్న రోజు శనేశ్వర స్వామిని పూజించిన విశేష ఫలితం ఉంటుందన్నారు.ఇక్కడ గోన బుద్ధారెడ్డి కాలం నాటి బ్రహ్మ సూత్రం గల పరమశివునికి ఈరోజు భక్తులచే రుద్రాభిషేక పూజలు,అర్చనలు,గణపతి, నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చనపూజలు భక్తులచే నిర్వహించారు.అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు,కమిటీ సభ్యులు రాజేష్, ప్రభాకరచారి,పుల్లయ్య, అడ్వకేట్ వీర శేఖర్ చారి, శ్రీకాంత్ రెడ్డి, ఆలయ ఆర్చకులు గవ్వమఠం శాంతి కుమార్, ఉమమహేశ్వర్,సిబ్బంది గోపాల్ రెడ్డి భక్తులు,మహిళలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.