పున్నమి ప్రతి నిధి
బిసి ల మీద కాంగ్రెస్ కి ఉన్నది కేవలం కపట ప్రేమమాత్రమే నని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ లబ్ది కోసం చట్ట పరిధిని అతిక్రమించి సాగిస్తున్న బీసీ రిజర్వేషన్ కపట క్రీడలో కోర్టు లో ఎదురు దెబ్బ తగిలింది అని అన్నారు. అయిల్ ఫామ్ రైతులకి నష్ట పరిహారం అందించాలి అని డిమాండ్ చేశారు. ఈ సమావేశం ప్రధాన కార్యదర్శి గుత్త వెంకటేశ్వర్లు, ప్రవీణ్, ఉపాధ్యక్షులు వీర వెళ్లి రాజేష్,నెల్లూరు బెనర్జీ కందుల శ్రీ కృష్ణ, రుద్రగాని మాధవ తదితరులు పాల్గొన్నారు


