సూపర్ జిఎస్టి- సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమం
రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరు పట్టణంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన( సూపర్ జిఎస్టి -సూపర్ సేవింగ్స్ ) పేద, మధ్యతరగతి వర్గాలకు, వ్యవసాయ, విద్యా, వ్యాపార రంగానికి, సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం. ఈ కార్యక్రమం రైల్వే కోడూరు వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది .ముఖ్య అతిథులుగా ఎం,పీ,డీ,వో నాగిరెడ్డి , ఏపీవో వసుంధర మరియు జీఎస్టీ క్యాంపెయిన్ ప్రత్యేక అధికారి నాగేంద్ర పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వర్ణకారులు మరియు టెక్స్టైల్స్ రంగం, ఆటోమొబైల్స్ రంగం, ఔషధ రంగాల, మరియు నిత్యవసర వర్తకులు పాల్గొనడం జరిగింది.
కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల్లో భాగంగా గణనీయంగా సేల్స్ పెరగడంతో ఎన్డీఏ ప్రభుత్వం పై ప్రజలు మరియు వర్తక వ్యాపారస్తులు మరింత విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచిందని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు వర్తక సంఘం అసోసియేషన్ అధ్యక్షుడు మండల రామకృష్ణ, ప్రధానకార్యదర్శి మేడ వెంకటసుబ్బయ్య, మెడికల్ కు సంబంధించి సాయం శ్రీధర్, మండల ప్రవీణ్, ఆడిటర్స్ మోపూరు వెంకటసుబ్బయ్య, దినకర్ బాబు, మొదలగు వ్యాపారస్తులు పాల్గొని వారి సందేశం చెప్పడం జరిగినది.


