సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి)
చేజర్ల మండలం వావిలేరు, పాడేరు గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి రైతులను ఉద్దేశించి మాట్లతూ, ప్రత్యామ్నాయ పంటగా సైలేజ్ మొక్క జొన్న పంటను సాగు చేసి 75 రోజులలో తక్కువ ఖర్చు తో అధిక ఆదాయము పొందవచ్చునని తెలియజేశారు.దీనికి సంబంధించి జిల్లాలో ట్రూ మీల్ కంపెనీ వారు ఒప్పంద ప్రాతిపదికన రైతుల దగ్గర టన్ను ఒక్కింటికి రూ.2250/- చొప్పున ఇస్తున్నారని, సగటున ఒక ఎకరాకు సాగు ఖర్చు పోను రూ.20000/- నికర ఆదాయము వస్తుందని తెలియచేసారు.కాబట్టి జిల్లాలోని రైతాంగం సైలేజి మొక్కజొన్న సాగుపై దృష్టి సారించాలని ఆమె తెలిపారు. అధిక యూరియా వాడకం వలన కలుగు పరిణామాలపై అవగాహన కల్పించారు. అదే విధంగా ఎడిఎ నర్సోజి మాట్లాతు అధికంగా యూరియా వినియోగం వలన నేలలో ఆమ్లతత్వం పెరిగి పోషకాలు అందుబాటులో లేకుండా పోతుందని తెలిపారు. నీటి మరియు నేల కాలుష్యం అధికమవుతుంది. పైరు ఎపుగా పెరిగి చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయని తద్వారా పురుగుమందులు తెగులు మందులు అధికంగా వాడవలసి వస్తుందని తెలియజేశారు.ఎఓ హిమ బిందు రైతులతో మాట్లాడుతూ భూమి లేని కౌలు రైతులు సిసిఎస్ కార్డు పొందడం వలన ప్రభుత్వం పథకాలు రాయితీని పొందవచ్చు అని తెలిపారు. అందువలన కౌలు రైతులు తప్పనిసరిగా సిసిఆర్సీ కార్డు పొందాలని ఆమె సూచించారు.సైలేజి మొక్కజొన్న సాగుపై సందేహాలు ఉన్నచో విశ్రాంత సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్.శ్రీనివాస్(9490247908)ను సంప్రదించాలని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమం లో నెల్లూరు ఎడిఎ బి. శ్రీదేవి, గ్రామ సర్పంచ్ జి.రాంబాబు విఎఎ సూర్య నారాయణ, హజరత్తయ్య మరియు రైతులు పాల్గొన్నారు


