నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
తిరుమలగిరి మండలం లో కొత్తగా 4000 మందికి, భూపట్టాల సర్వేలో 3000 మంది అనర్హులు గుర్తింపు. పేద ప్రజలు దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్నా భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో మానవీయ కోణంలో భూ సమస్యలకు పరిష్కారం చూపాలని రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సూచించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంగళవారం నాడు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో భూ సమస్యలపై అటవీశాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖతో కలిసి మంత్రి గారు సమావేశం నిర్వహించారు.

భూ సమస్యలకు పరిష్కారాలు చూపాలన్న :మంత్రి
నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) తిరుమలగిరి మండలం లో కొత్తగా 4000 మందికి, భూపట్టాల సర్వేలో 3000 మంది అనర్హులు గుర్తింపు. పేద ప్రజలు దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్నా భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో మానవీయ కోణంలో భూ సమస్యలకు పరిష్కారం చూపాలని రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సూచించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంగళవారం నాడు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో భూ సమస్యలపై అటవీశాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖతో కలిసి మంత్రి గారు సమావేశం నిర్వహించారు.

