*టేకు చెట్లు… ఆమె పొలంలో లేవు…*
*పొలం యజమాని రామ్మూర్తి*
పొదలకూరు మండలంలోని మరుపూరు గ్రామ సమీపంలో బింగిమళ్ళ. రామ మూర్తి, వినోద్ సింగ్, టీడీపీ యువ నాయకుడు డేగా. యస్వంత్ రెడ్డి, తెలుగు యువత ఉపాధ్యక్షుడు ఆదాల. మురళి రెడ్డి టేకు చెట్ల పొలం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 2009 నుండి ఈ పొలం మా అధీనంలో వుంది ఇటీవల టేకు చెట్లు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. దాని మీద పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాము. వాళ్లు విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. రాజేశ్వరమ్మ అనే ఆమె మా పొలంలో టేకు చెట్లు టీడీపీ నేతలు నరికి వేశారంటూ మాట్లాడడం హాస్యస్పదమన్నారు. ఆమె పొలంలో టేకు చెట్లు లేవు. ఒకవేళ ఉంటే ఆధారాలు చూపించాలన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి. చంద్రమోహన్ రెడ్డి కి, త్వరలో మంత్రి పదవి వస్తుందని ఆయన మీద లేని పోనీ ఆరోపణలు చేసి వదంతులు సృష్టిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదుఅని పద్ధతి మార్చుకోవాలన్నారు.


