పిఠాపురం : ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ శుక్రవారం పాదగయా క్షేత్రంకు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి, స్వయంభూ శ్రీ దత్తాత్రేయ స్వామివారి, పదవ శక్తి పీఠం శ్రీ పురుహుతికా అమ్మవార్ల దర్శనం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద ఆశీర్వచనం అనంతరం, దేవస్ధాన సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ వారికి శేష వస్త్రాలు, స్వామి వారి చిత్ర పటం, ప్రసాదం అందజేశారు. ఈకార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ బి.వీర భద్రరావు, ఆర్.ఆర్.డి.ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ దత్తత్రేయ, పిఠాపురం సిఐ జి. శ్రీనివాస్, ఎస్ఐ వి.మణికుమార్ పాల్గొన్నారు.

పాదగయా క్షేత్రం దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ
పిఠాపురం : ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ శుక్రవారం పాదగయా క్షేత్రంకు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి, స్వయంభూ శ్రీ దత్తాత్రేయ స్వామివారి, పదవ శక్తి పీఠం శ్రీ పురుహుతికా అమ్మవార్ల దర్శనం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద ఆశీర్వచనం అనంతరం, దేవస్ధాన సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ వారికి శేష వస్త్రాలు, స్వామి వారి చిత్ర పటం, ప్రసాదం అందజేశారు. ఈకార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ బి.వీర భద్రరావు, ఆర్.ఆర్.డి.ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ దత్తత్రేయ, పిఠాపురం సిఐ జి. శ్రీనివాస్, ఎస్ఐ వి.మణికుమార్ పాల్గొన్నారు.

