రాయచోటి ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
ఆగస్టు 28, 2000న విద్యుత్ చార్జీలు తగ్గించాలని అమరులైన వారి స్ఫూర్తితో, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో రాయచోటిలో ప్రతిజ్ఞ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ, విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, ట్రూడౌన్ పేరుతో ధరలు తగ్గిస్తామని ప్రకటించి, ఆపై ట్రూ అప్ పేరుతో మరో రూ. 12,771 కోట్లు భారాన్ని మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు


