Monday, 8 December 2025
  • Home  
  • మార్కెట్ యార్డ్ కమిటీలో టిడిపి, జనసేన డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం
- అన్నమయ్య

మార్కెట్ యార్డ్ కమిటీలో టిడిపి, జనసేన డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం

వ్యవసాయ మార్కెట్ యార్డులో కమిటీలో చిట్వేలి మండలానికి చెందిన ఇద్దరు డైరెక్టర్లు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టిడిపికి చెందిన బొచ్చు రామచంద్ర యాదవ్, జనసేన కు చెందిన తుపాకుల పెంచలయ్య కు అవకాశం ఇస్తూ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లుగా నియమించారు. ఈ సందర్భంగా తుపాకుల పెంచలయ్య మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన టిడిపి, జనసేన ఇన్చార్జిలకు మరియు ప్రతిపాదించిన నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ మండలానికి తమవంతు రైతులకు సహకారాలు అందిస్తామని, తమ గొంతు మార్కెట్ యార్డ్ నందు వినిపించేందుకు అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి మా మీద నమ్మకం పెట్టుకున్న వారికి నమ్మకాన్ని మమ్ము చేయకుండా వారు నమ్మకం నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా వారు తెలియపరచారు. రైతుకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని కష్టాలు ఏదైనా సరే వారి పనిచేస్తామని తెలియపరచారు. అనంతరం బొచ్చు రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం, మార్కెట్ సదుపాయాల అభివృద్ధి, పారదర్శకమైన కొనుగోలు-అమ్మకపు విధానాలకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. రైతులకు న్యాయమైన ధర అందించడమే తన ప్రధాన లక్ష్యమని, మార్కెట్ యార్డ్‌లో ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

వ్యవసాయ మార్కెట్ యార్డులో కమిటీలో చిట్వేలి మండలానికి చెందిన ఇద్దరు డైరెక్టర్లు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టిడిపికి చెందిన బొచ్చు రామచంద్ర యాదవ్, జనసేన కు చెందిన తుపాకుల పెంచలయ్య కు అవకాశం ఇస్తూ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లుగా నియమించారు. ఈ సందర్భంగా తుపాకుల పెంచలయ్య మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన టిడిపి, జనసేన ఇన్చార్జిలకు మరియు ప్రతిపాదించిన నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ మండలానికి తమవంతు రైతులకు సహకారాలు అందిస్తామని, తమ గొంతు మార్కెట్ యార్డ్ నందు వినిపించేందుకు అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి మా మీద నమ్మకం పెట్టుకున్న వారికి నమ్మకాన్ని మమ్ము చేయకుండా వారు నమ్మకం నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా వారు తెలియపరచారు. రైతుకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని కష్టాలు ఏదైనా సరే వారి పనిచేస్తామని తెలియపరచారు.
అనంతరం బొచ్చు రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం, మార్కెట్ సదుపాయాల అభివృద్ధి, పారదర్శకమైన కొనుగోలు-అమ్మకపు విధానాలకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. రైతులకు న్యాయమైన ధర అందించడమే తన ప్రధాన లక్ష్యమని, మార్కెట్ యార్డ్‌లో ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.