రైతన్నల మేలు కోసం రూపన్న కృషి– ముక్కా రూపానంద రెడ్డి అరవ శ్రీధర్ నాయకత్వంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం విజయవంతం అన్నదాత ఆశలకూ అండగా ముక్కా రూపానంద రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నాయకత్వం రైల్వేకోడూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఈరోజు జరిగిన “అన్నదాత సుఖీభవ” పథకానికి సంబంధించిన సమావేశంలో ముఖ్య అతిథులుగా రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి , ప్రభుత్వ విప్ మరియు రైల్వేకోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రూ.17.23 కోట్ల అమౌంట్ రైతుల ఖాతాల్లో జమ కానుందని, మొత్తం 5 మండలాల రైతులు ఈ పథక ప్రయోజనాన్నిపొందబోతున్నారని వారు తెలిపారు.ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ“కూటమి ప్రభుత్వం అంటే రైతులకు అండగా నిలిచే ప్రభుత్వం. ఇటీవల బొప్పాయి రైతులు ఎదుర్కొన్న ధరల సమస్యపై వెంటనే స్పందించిన చంద్రబాబు నాయుడు కలెక్టర్ ద్వారా బొప్పాయి ధర రూ.9కి ఫిక్స్ చేయించారు. దళారీల వ్యవస్థపై నియంత్రణచర్యలుచేపట్టారు.అనంతరం”అన్నదాత సుఖీభవ” రైతులకు ముందెన్నడూ లేని విధంగా ఈ ఏడాది రూ.20,000/- పైగా సహాయం అందుతోంది.” అని పేర్కొన్నారు.అరవ శ్రీధర్ మాట్లాడుతూ“మా కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్ యోజనతో పాటు అన్నదాత సుఖీభవ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఈ రెండు పథకాల ద్వారా సుమారు 24622 మంది అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయబడతాయి.” అని అన్నారు.ఈ పథకాలు కేవలం సహాయం కాదు, రైతుకు గౌరవం మరియు పంటల పెట్టుబడికి భరోసా అని నేతలు పేర్కొన్నారు.పలుశాఖఅధికారులు,కూటమి నేతలు, 5 మండలాల నాయకులు, రైతులు, కార్యకర్తలు,ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

రైతుల పక్షంగా నిలిచిన కూటమి ప్రభుత్వం – “అన్నదాత సుఖీభవ” పథకం ద్వారా రైల్వే కోడూరు నియోజకవర్గం రైతన్నల మేలు కోసం ఐదు మండలాల్లో రూ.17.23 కోట్ల నిధులు మంజూరు
రైతన్నల మేలు కోసం రూపన్న కృషి– ముక్కా రూపానంద రెడ్డి అరవ శ్రీధర్ నాయకత్వంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం విజయవంతం అన్నదాత ఆశలకూ అండగా ముక్కా రూపానంద రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నాయకత్వం రైల్వేకోడూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఈరోజు జరిగిన “అన్నదాత సుఖీభవ” పథకానికి సంబంధించిన సమావేశంలో ముఖ్య అతిథులుగా రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి , ప్రభుత్వ విప్ మరియు రైల్వేకోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రూ.17.23 కోట్ల అమౌంట్ రైతుల ఖాతాల్లో జమ కానుందని, మొత్తం 5 మండలాల రైతులు ఈ పథక ప్రయోజనాన్నిపొందబోతున్నారని వారు తెలిపారు.ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ“కూటమి ప్రభుత్వం అంటే రైతులకు అండగా నిలిచే ప్రభుత్వం. ఇటీవల బొప్పాయి రైతులు ఎదుర్కొన్న ధరల సమస్యపై వెంటనే స్పందించిన చంద్రబాబు నాయుడు కలెక్టర్ ద్వారా బొప్పాయి ధర రూ.9కి ఫిక్స్ చేయించారు. దళారీల వ్యవస్థపై నియంత్రణచర్యలుచేపట్టారు.అనంతరం”అన్నదాత సుఖీభవ” రైతులకు ముందెన్నడూ లేని విధంగా ఈ ఏడాది రూ.20,000/- పైగా సహాయం అందుతోంది.” అని పేర్కొన్నారు.అరవ శ్రీధర్ మాట్లాడుతూ“మా కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్ యోజనతో పాటు అన్నదాత సుఖీభవ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఈ రెండు పథకాల ద్వారా సుమారు 24622 మంది అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయబడతాయి.” అని అన్నారు.ఈ పథకాలు కేవలం సహాయం కాదు, రైతుకు గౌరవం మరియు పంటల పెట్టుబడికి భరోసా అని నేతలు పేర్కొన్నారు.పలుశాఖఅధికారులు,కూటమి నేతలు, 5 మండలాల నాయకులు, రైతులు, కార్యకర్తలు,ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

