సిద్ధవటం జూలై22
సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే వైసిపి గోబెల్స్ ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందంటూ మండల టిడిపి అధ్యక్షులు మోహన్ రెడ్డి తెలిపారు మండలంలోని పెద్దపల్లి గ్రామపంచాయతీ కను మ లో పల్లె గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నిర్వహించారు ఈ సందర్భంగా టిడిపి అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పిన వాగ్దానాల ప్రకారం సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరువైతుంటే వైసిపి గోబెల్స్ ప్రచారాలు మానుకోవాలని తల్లికి వందనం దీపం పథకం, అన్నా క్యాంటీన్లు యువతకు ఉద్యోగాలు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, రైతు సంక్షేమం మహిళా సంక్షేమ ఇవన్నీ అమలు అవుతుంటే వైసిపికి వణుకు పుట్టి మాపై గోబల్స్ ప్రచారాలు మానుకోవాలని మీరు ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడింది అని అన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ దశరథ నాయుడు, రాష్ట్ర బీసీ సెల్ కార్య నిర్వహణ కార్యదర్శి శ్రీనివాస నాయుడు మాజీ మార్కెట్ చైర్మన్ సయ్యద్ జవహర్ భాష, ముస్లిం మైనారిటీ అధ్యక్షులు డాక్టర్ వీరభద్రుడు సర్పంచ్ ప్రతినిధి తుర్ర ప్రతాప్ నాయుడు బీసీ సెల్ నియోజకవర్గ కార్యదర్శి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు

