Thursday, 4 June 2026
  • Home  
  • 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రేపల్లెవాడలో గ్రామ సభ*
- ఖమ్మం

99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రేపల్లెవాడలో గ్రామ సభ*

*99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రేపల్లెవాడలో గ్రామ సభ* *ప్రభుత్వ పథకాలపై అవగాహన – సమస్యలపై సత్వర పరిష్కారానికి హామీ* *మొక్కలు నాటి పచ్చదనానికి శ్రీకారం* ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్ మే 04 *ఏన్కూరు* రేపల్లెవాడ గ్రామపంచాయతీలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రేపల్లెవాడ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గురువారం గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ అజ్మీర సురేష్ అధ్యక్షత వహించారు. ఈ గ్రామ సభకు మండల ఎంపీడీవో పల్లి భాగ్యశ్రీ, అగ్రికల్చర్ ఏడీఏ కరుణశ్రీ, ఏవో నరసింహారావు, పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్, వివిధ శాఖల ఉద్యోగులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు, పంచాయతీ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. *పథకాలపై విస్తృత అవగాహన:* ఈ సందర్భంగా ఎంపీడీవో భాగ్యశ్రీ మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. ఆరు గ్యారెంటీలు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, గృహజ్యోతి, మహాలక్ష్మి, చేయూత పథకాల అమలు తీరు, లబ్ధిదారుల ఎంపికపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. అర్హులందరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. *రైతులకు వ్యవసాయ సూచనలు:* ఏడీఏ కరుణశ్రీ మాట్లాడుతూ ‘ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు విత్తనాలు, ఎరువులను ప్రభుత్వ అనుమతి పొందిన దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి. నకిలీ విత్తనాల బెడద లేకుండా అధికారులు నిఘా పెట్టారు. పంటల బీమా, రైతు భరోసా నమోదు ప్రక్రియపై రైతులకు అవగాహన కల్పించాం’ అని అన్నారు. గ్రామ సభ ముగిసిన అనంతరం ‘వన మహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ ఆవరణలో అధికారులు, సర్పంచ్, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ‘ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’ అని సర్పంచ్ అజ్మీర సురేష్ పిలుపునిచ్చారు. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల వద్దకే వస్తున్నాయి. గ్రామ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ గ్రామ సభలు ఎంతో ఉపయోగపడతాయి. అధికారుల సహకారంతో రేపల్లెవాడను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం’ అని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, మహిళా సంఘాల సభ్యులు, యువకులు పాల్గొన్నారు.

*99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రేపల్లెవాడలో గ్రామ సభ*

*ప్రభుత్వ పథకాలపై అవగాహన – సమస్యలపై సత్వర పరిష్కారానికి హామీ*

*మొక్కలు నాటి పచ్చదనానికి శ్రీకారం*

ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్ మే 04

*ఏన్కూరు*
రేపల్లెవాడ గ్రామపంచాయతీలో
99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రేపల్లెవాడ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గురువారం గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ అజ్మీర సురేష్ అధ్యక్షత వహించారు.

ఈ గ్రామ సభకు మండల ఎంపీడీవో పల్లి భాగ్యశ్రీ, అగ్రికల్చర్ ఏడీఏ కరుణశ్రీ, ఏవో నరసింహారావు, పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్, వివిధ శాఖల ఉద్యోగులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు, పంచాయతీ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

*పథకాలపై విస్తృత అవగాహన:*

ఈ సందర్భంగా ఎంపీడీవో భాగ్యశ్రీ మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. ఆరు గ్యారెంటీలు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, గృహజ్యోతి, మహాలక్ష్మి, చేయూత పథకాల అమలు తీరు, లబ్ధిదారుల ఎంపికపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. అర్హులందరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.

*రైతులకు వ్యవసాయ సూచనలు:*

ఏడీఏ కరుణశ్రీ మాట్లాడుతూ ‘ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు విత్తనాలు, ఎరువులను ప్రభుత్వ అనుమతి పొందిన దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి. నకిలీ విత్తనాల బెడద లేకుండా అధికారులు నిఘా పెట్టారు. పంటల బీమా, రైతు భరోసా నమోదు ప్రక్రియపై రైతులకు అవగాహన కల్పించాం’ అని అన్నారు.

గ్రామ సభ ముగిసిన అనంతరం ‘వన మహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ ఆవరణలో అధికారులు, సర్పంచ్, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ‘ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’ అని సర్పంచ్ అజ్మీర సురేష్ పిలుపునిచ్చారు.

ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల వద్దకే వస్తున్నాయి. గ్రామ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ గ్రామ సభలు ఎంతో ఉపయోగపడతాయి. అధికారుల సహకారంతో రేపల్లెవాడను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం’ అని సర్పంచ్ తెలిపారు.
కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, మహిళా సంఘాల సభ్యులు, యువకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.