ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన రవాణా వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానానికి ఆమోదం తెలిపింది. ఈ విధానం ప్రకారం 2028 ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలో కొత్తగా నమోదయ్యే ద్విచక్ర వాహనాలు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలే కావాలి. అలాగే కొత్తగా నమోదయ్యే తేలికపాటి వాణిజ్య వాహనాలు, చెత్త సేకరణ వాహనాలు కూడా ఎలక్ట్రిక్ విధానంలోకి మారనున్నాయి. పాత పెట్రోల్, డీజిల్ వాహనాలను స్క్రాప్ చేసే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది. నగరంలో ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచడం, ఈవీ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.

2028 నుంచి ఢిల్లీలో కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకే అనుమతి
ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన రవాణా వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానానికి ఆమోదం తెలిపింది. ఈ విధానం ప్రకారం 2028 ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలో కొత్తగా నమోదయ్యే ద్విచక్ర వాహనాలు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలే కావాలి. అలాగే కొత్తగా నమోదయ్యే తేలికపాటి వాణిజ్య వాహనాలు, చెత్త సేకరణ వాహనాలు కూడా ఎలక్ట్రిక్ విధానంలోకి మారనున్నాయి. పాత పెట్రోల్, డీజిల్ వాహనాలను స్క్రాప్ చేసే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది. నగరంలో ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచడం, ఈవీ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.

