11వ వార్డులో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం!
కొత్త మోటారు ఏర్పాటు – కాలనీ ప్రజల కష్టాలకు ముగింపు
పున్నమి న్యూస్ ప్రతినిధి
16 ఏప్రిల్ 2026
రంగారెడ్డి జిల్లా
ఇబ్రహీంపట్నం
నియోజకవర్గం ఇంచార్జ్ :
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని మేడిపల్లి నక్కర్త లో
11వ వార్డులో చాలా కాలంగా నెలకొన్న నీటి కొరత సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు కోసం రోజూ గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యపై పలుమార్లు స్థానిక ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన పరిష్కారం లభించలేదు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ప్రజల బాధలను అర్థం చేసుకున్న
11వ వార్డు సభ్యులు వంగూరి మనోహర్ & జంగయ్య
సమస్యను సీరియస్గా తీసుకుని వెంటనే చర్యలు చేపట్టారు. కాలనీ పరిస్థితిని పరిశీలించి, అవసరమైన ఏర్పాట్లు చేసి కొత్త మోటారు ఏర్పాటు చేయించారు.
ఈ కొత్త మోటారు ఏర్పాటు వల్ల ఇప్పుడు కాలనీకి సమృద్ధిగా నీటి సరఫరా జరుగుతోంది. చాలా కాలంగా నీటి కోసం పడిన కష్టాలు ఒక్కసారిగా తీరడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక ప్రజలు మాట్లాడుతూ –
“ఇంత త్వరగా స్పందించి మా సమస్యను పరిష్కరించిన మా వార్డు సభ్యులకు కృతజ్ఞతలు” అని తెలిపారు. వారి సేవాభావం, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
“ప్రజల సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారం చూపే నాయకత్వం ఇదే!”
11వ వార్డు ప్రజల తరఫున వంగూరి మనోహర్ & జంగయ్య కి హృదయపూర్వక ధన్యవాదాలు







