పాడేరులో శుక్రవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, అరకులోయ ప్రిన్సిపాల్ డా.ఆర్.కుసుమకుమారి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఎంపీ డా.గుమ్మా తనూజారాణిని కలిసి కళాశాల సమస్యలపై మెమొరాండం సమర్పించారు. వర్షాకాలంలో విద్యార్థులు, సిబ్బంది రాకపోకలకు ఇబ్బందులు లేకుండా సీసీ రోడ్డు నిర్మించాలని, కళాశాల చుట్టూ ఉన్న గుట్టలు, రాళ్లను చదును చేసి ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని, ప్రవేశద్వారం వద్ద నేమ్బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. వినతి కి ఎంపీ సానుకూలంగా స్పందించి కళాశాలను సందర్శించి సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ, చెట్టి వినయ్ సహకరిస్తామని తెలిపారు.

అరకు: మహిళా డిగ్రీ కళాశాల సమస్యలపై ఎంపీకి వినతి
పాడేరులో శుక్రవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, అరకులోయ ప్రిన్సిపాల్ డా.ఆర్.కుసుమకుమారి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఎంపీ డా.గుమ్మా తనూజారాణిని కలిసి కళాశాల సమస్యలపై మెమొరాండం సమర్పించారు. వర్షాకాలంలో విద్యార్థులు, సిబ్బంది రాకపోకలకు ఇబ్బందులు లేకుండా సీసీ రోడ్డు నిర్మించాలని, కళాశాల చుట్టూ ఉన్న గుట్టలు, రాళ్లను చదును చేసి ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని, ప్రవేశద్వారం వద్ద నేమ్బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. వినతి కి ఎంపీ సానుకూలంగా స్పందించి కళాశాలను సందర్శించి సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ, చెట్టి వినయ్ సహకరిస్తామని తెలిపారు.

