Saturday, 15 August 2026
  • Home  
  • హందుజా బొగ్గు లారీలను నిలుపుదల చేయాలి..
- ఆంధ్రప్రదేశ్

హందుజా బొగ్గు లారీలను నిలుపుదల చేయాలి..

సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి డిమాండ్ పరవాడ, (పున్నమి ప్రతినిధి) పరవాడ మండల పరిషత్ కార్యాలయం జంక్షన్ లో హిందూజా బొగ్గు లారీలను ఈ మార్గం మీదగా నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గని శెట్టి మాట్లాడుతూ హిందూజా బొగ్గు లారీలు ఈ మార్గం మీదగా ప్రయాణించడం వలన తీవ్రమైన బొగ్గు ఈ రోడ్లపై పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లారీలు నిండు ధూళి రోడ్లపై వేసుకుంటూ లారీలు వెళుతున్నాయని దీనివలన పరవాడ ఎమ్మార్వో ఆఫీస్ జంక్షన్, సినిమా హాల్ జంక్షన్, సబ్ స్టేషన్, లంకెలపాలెం గ్రామం పూర్తిగా ధూళితో కపివేయపడుతుందని ఈ గ్రామాల్లో ప్రజలు ఉండలేని పరిస్థితి ఏర్పడుతుందని గని శెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. అధిక లోడుతో ప్రయాణిస్తున్న లారీలపై ఆర్టీవో అధికారులు దాడులు చేసికేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మార్గంలో అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని రోడ్లు పూర్తిగా పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి అన్నారు. హిందూజా కి రైల్వే ద్వారా బొగ్గు తరలించుకోవాలని డిమాండ్ చేశారు. మహారత్న పరిశ్రమగా ఉన్న ఎన్టిపిసి ప్రజల్ని రకంగా కాలుష్యానికి నెట్టు వేయడం అన్యాయం అన్నారు. వెంటనే , ధూళి లారీలపై చర్యలు చేపట్టాలని గని శెట్టి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, సత్యనారాయణ, అప్పల నరసమ్మ, చిన్న, ఫాతిమా బేగం, తదితరులు పాల్గొన్నారు.

సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి డిమాండ్

పరవాడ, (పున్నమి ప్రతినిధి)

పరవాడ మండల పరిషత్ కార్యాలయం జంక్షన్ లో హిందూజా బొగ్గు లారీలను ఈ మార్గం మీదగా నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గని శెట్టి మాట్లాడుతూ హిందూజా బొగ్గు లారీలు ఈ మార్గం మీదగా ప్రయాణించడం వలన తీవ్రమైన బొగ్గు ఈ రోడ్లపై పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లారీలు నిండు ధూళి రోడ్లపై వేసుకుంటూ లారీలు వెళుతున్నాయని దీనివలన పరవాడ ఎమ్మార్వో ఆఫీస్ జంక్షన్, సినిమా హాల్ జంక్షన్, సబ్ స్టేషన్, లంకెలపాలెం గ్రామం పూర్తిగా ధూళితో కపివేయపడుతుందని ఈ గ్రామాల్లో ప్రజలు ఉండలేని పరిస్థితి ఏర్పడుతుందని గని శెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. అధిక లోడుతో ప్రయాణిస్తున్న లారీలపై ఆర్టీవో అధికారులు దాడులు చేసికేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మార్గంలో అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని రోడ్లు పూర్తిగా పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి అన్నారు. హిందూజా కి రైల్వే ద్వారా బొగ్గు తరలించుకోవాలని డిమాండ్ చేశారు. మహారత్న పరిశ్రమగా ఉన్న ఎన్టిపిసి ప్రజల్ని రకంగా కాలుష్యానికి నెట్టు వేయడం అన్యాయం అన్నారు. వెంటనే , ధూళి లారీలపై చర్యలు చేపట్టాలని గని శెట్టి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, సత్యనారాయణ, అప్పల నరసమ్మ, చిన్న, ఫాతిమా బేగం, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.