పున్నమి ప్రతినిధి :తిరుపతి
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, తిరుపతి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమం నిర్వహించబడింది.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, దొంగ హామీలు మరియు మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వ పాలనకు రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, తిరుపతి సౌత్ క్లస్టర్ అధ్యక్షులు కుమార్ గారు, మరియు సంబంధిత 13 డివిజన్ల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎం.ఆర్.పల్లి సర్కిల్లోని దండి మార్చ్ విగ్రహం వద్ద చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.
“హామీలు ఇచ్చి మోసం చేసిన పాలనకు రెండేళ్లు…
ప్రజలను నమ్మించి వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వానికి ఇదే మా నిరసన!







