ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 12 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని కృష్ణపట్నం పోర్టు క్రాస్ రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ సీఐ సుభాన్ తెలిపిన వివరాల మేరకు, మనుబోలుకు చెందిన మల్లి శ్రీనివాసులు టాటా ఏస్ వాహనంలో 1,020 కిలోల రేషన్ బియ్యాన్ని హోటళ్లు, దుకాణాలకు విక్రయించేందుకు తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రూ.48,960 విలువైన బియ్యంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తనిఖీల్లో సీఎస్ఓటీ రవి, వీఆర్వో రసూల్ తదితరులు పాల్గొన్నారు.

రూ.49 వేల విలువైన రేషన్ బియ్యం స్వాధీనం
ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 12 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని కృష్ణపట్నం పోర్టు క్రాస్ రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ సీఐ సుభాన్ తెలిపిన వివరాల మేరకు, మనుబోలుకు చెందిన మల్లి శ్రీనివాసులు టాటా ఏస్ వాహనంలో 1,020 కిలోల రేషన్ బియ్యాన్ని హోటళ్లు, దుకాణాలకు విక్రయించేందుకు తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రూ.48,960 విలువైన బియ్యంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తనిఖీల్లో సీఎస్ఓటీ రవి, వీఆర్వో రసూల్ తదితరులు పాల్గొన్నారు.

