నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించిన వివరాల ప్రకారం, అదే స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఇద్దరు 16 ఏళ్ల విద్యార్థులే నిందితులు. డబ్బు కోసం ఇంట్లోకి చొరబడి, ప్రతిఘటించిన రూపారెడ్డిపై కత్తితో దాడి చేసి రూ.2.50 లక్షలు, ఐఫోన్ అపహరించినట్లు పోలీసులు తెలిపారు. 70 సీసీ కెమెరాలు, ఫోరెన్సిక్, కాల్డేటా ఆధారాలతో దర్యాప్తు సాగించి నిందితులను గుర్తించారు. వారి నుంచి రూ.1.56 లక్షలు, ఐఫోన్, కత్తి, గ్లౌజులు స్వాధీనం చేసుకున్నారు.

‘బాబూ’ అన్న మాటతో వీడిన మర్డర్ మిస్టరీ
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించిన వివరాల ప్రకారం, అదే స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఇద్దరు 16 ఏళ్ల విద్యార్థులే నిందితులు. డబ్బు కోసం ఇంట్లోకి చొరబడి, ప్రతిఘటించిన రూపారెడ్డిపై కత్తితో దాడి చేసి రూ.2.50 లక్షలు, ఐఫోన్ అపహరించినట్లు పోలీసులు తెలిపారు. 70 సీసీ కెమెరాలు, ఫోరెన్సిక్, కాల్డేటా ఆధారాలతో దర్యాప్తు సాగించి నిందితులను గుర్తించారు. వారి నుంచి రూ.1.56 లక్షలు, ఐఫోన్, కత్తి, గ్లౌజులు స్వాధీనం చేసుకున్నారు.

