ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, భోగాపురం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం చేసేందుకు విమానాశ్రయం అడ్మిన్ బ్లాక్లో శనివారం నాయకులు కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు , రాష్ట్ర మంత్రులు అనగాని సత్య ప్రసాద్ , కొండపల్లి శ్రీనివాస్ ఎంపీ చింతకాయల విజయ్, పార్టీ రాష్ట్ర నాయకులు కిలారి రాజేష్ తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన సభా నిర్వహణ, భద్రత, ప్రజల రాకపోకలు, వాహనాల పార్కింగ్, తాగు నీరు, భోజనం ఇతర మౌలిక సౌకర్యాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించి, ప్రతి ఏర్పాటును పకడ్బందీగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనపై నాయకుల కీలక సమీక్షా సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, భోగాపురం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం చేసేందుకు విమానాశ్రయం అడ్మిన్ బ్లాక్లో శనివారం నాయకులు కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు , రాష్ట్ర మంత్రులు అనగాని సత్య ప్రసాద్ , కొండపల్లి శ్రీనివాస్ ఎంపీ చింతకాయల విజయ్, పార్టీ రాష్ట్ర నాయకులు కిలారి రాజేష్ తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన సభా నిర్వహణ, భద్రత, ప్రజల రాకపోకలు, వాహనాల పార్కింగ్, తాగు నీరు, భోజనం ఇతర మౌలిక సౌకర్యాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించి, ప్రతి ఏర్పాటును పకడ్బందీగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

