నిడదవోలు, జూలై 29 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సంస్థాగత సమావేశం బీఎల్ఏ–1 సింహాద్రి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నిడదవోలు నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ మద్దిపాటి రజని, బీఎల్ఏ–1 సింహాద్రి సత్యనారాయణ పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, కార్యకర్తల సమన్వయం, భవిష్యత్ కార్యక్రమాలపై నాయకులు చర్చించారు. ఈ సందర్భంగా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు వెంకటేశ్వరరావు, జై శ్రీనివాస్, పాపారావు, సత్యనారాయణ, నరసింహారావు, బాలాజీ, లీలాకృష్ణతో పాటు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



