Wednesday, 22 July 2026
  • Home  
  • *జిల్లా కలెక్టర్ ను కలిసిన సిఈఓ ఆవుల :*
- తిరుపతి

*జిల్లా కలెక్టర్ ను కలిసిన సిఈఓ ఆవుల :*

*లండన్ అవార్డు దక్కిన సిఈఓకు ప్రశంసలు :* ఆంధ్రప్రదేశ్ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు (ఏపీఎంఏపీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఈఓ), రాష్ట్ర అటవీశాఖ సీనియర్ అధికారి ఆవుల చంద్రశేఖర్ మంగళవారం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు శాలువా కప్పి, మొక్క, పుష్పగుచ్ఛం, జ్ఞాపిక అందజేసి సత్కరించారు. ఇటీవల లండన్ నగరంలోని బ్రిటన్ పార్లమెంట్ హౌస్ లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ నుంచి అంతర్జాతీయ అవార్డు అందుకున్న సీఈవో చంద్రశేఖర్ కృషిని కలెక్టర్ ప్రశంసించారు. చంద్రగిరి మండలం లోని పనపాకం సిఈఓ స్వగ్రామం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం లోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సమిష్టికృషి తోనే తనకు అంతర్జాతీయ అవార్డు దక్కిందని ఏపీఎంఏపీ సిఈఓ ఆవుల చంద్రశేఖర్ ఈ సందర్భంగా అన్నారు. లండన్ లో అంతర్జాతీయ అవార్డు అందుకుని తొలిసారిగా తిరుపతి కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన ఆయనను పలువురు అధికారులు, ఉద్యోగులు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సిఈఓ మాట్లాడుతూ, తన విజయం వెనక ఎందరో కృషి దాగి వుందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో తనకు ఎంతగానో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి సిఈఓ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ రికార్డు సాధించేలా ప్రోత్సహించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, మంత్రి సత్యకుమార్ కు, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తన 10వ సమ్మిట్ – అంతర్జాతీయ అవార్డుల ప్రదానోత్సవం యూకే పార్లమెంట్‌లోని ప్రతిష్టాత్మకమైన హౌస్ ఆఫ్ కామన్స్, ప్యాలెస్ ఆఫ్ వెస్ట్‌మిన్‌స్టర్‌లో ఘనంగా నిర్వహించిందన్నారు. ఈ విశిష్టమైన వేడుక, యూకే (యునైటెడ్ కింగ్‌డమ్), యూఎస్ఏ (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా), రష్యా, ఫ్రాన్స్, ఇటలీ, ఇండియా, నేపాల్, కజకిస్తాన్, కెనడా, మెక్సికో, పోర్చుగల్, స్పెయిన్, స్విట్జర్లాండ్, బెల్జియం, జర్మనీ, ఈజిప్ట్, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, పోలాండ్, జపాన్, ఆస్ట్రేలియా, మారిషస్ దేశాల నుండి వచ్చిన అత్యుత్తమ వ్యక్తులు, సంస్థలను సత్కరించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ప్రజా సేవ, దౌత్యం, వ్యాపార రంగాలలో రాణించిన వారిని కీర్తించిందన్నారు. ఈ వేడుకలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) సంస్థ సిఈఓ సంతోష్ శుక్లా, రాజేష్ శుక్ల, బ్రిటన్ పార్లమెంటు సభ్యులు గరేత్ బకాన్, వీరేంద్ర శర్మ, మిస్ ఇంగ్లాండ్ లిమిటెడ్ డైరెక్టర్ యాంజీ బిస్లె తదితరులు అవార్డును అందజేశారని తెలిపారు. ప్రపంచ ప్రముఖులు, క్యాబినెట్ మంత్రులు, దౌత్యవేత్తలు, విధాన రూపకర్తలు, అంతర్జాతీయ వ్యాపార నాయకులు వంటి ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరయ్యారన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుందని, విభిన్న దేశాలు, రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్న ఈ వేడుక, అర్థవంతమైన చర్చలను ప్రోత్సహించి, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నామన్నారు. ప్రపంచ ఐక్యత, గుర్తింపు, పురోగతిని ప్రోత్సహించడంలో ఈ వేడుకల ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ సంతోష్ శుక్లా సభలో ప్రకటన చేశారన్నారు. ఈ వేడుక శ్రేష్ఠతను గౌరవించడమే కాకుండా, ప్రపంచ పరివర్తన దిశగా సామూహిక బాధ్యతను ప్రేరేపిస్తుందని ఆయన పేర్కొన్నారు. దాని అంతర్జాతీయ ప్రభావం, ఉన్నత స్థాయి భాగస్వామ్యంతో, 10వ సమ్మిట్ – అవార్డుల ప్రదానోత్సవం యూకే పార్లమెంట్ నడిబొడ్డున ఒక మైలురాయి సమావేశంగా నిలుస్తుందన్నారు.

*లండన్ అవార్డు దక్కిన సిఈఓకు ప్రశంసలు :*
ఆంధ్రప్రదేశ్ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు (ఏపీఎంఏపీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఈఓ), రాష్ట్ర అటవీశాఖ సీనియర్ అధికారి ఆవుల చంద్రశేఖర్ మంగళవారం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు శాలువా కప్పి, మొక్క, పుష్పగుచ్ఛం, జ్ఞాపిక అందజేసి సత్కరించారు. ఇటీవల లండన్ నగరంలోని బ్రిటన్ పార్లమెంట్ హౌస్ లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ నుంచి అంతర్జాతీయ అవార్డు అందుకున్న సీఈవో చంద్రశేఖర్ కృషిని కలెక్టర్ ప్రశంసించారు. చంద్రగిరి మండలం లోని పనపాకం సిఈఓ స్వగ్రామం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం లోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సమిష్టికృషి తోనే తనకు అంతర్జాతీయ అవార్డు దక్కిందని ఏపీఎంఏపీ సిఈఓ ఆవుల చంద్రశేఖర్ ఈ సందర్భంగా అన్నారు. లండన్ లో అంతర్జాతీయ అవార్డు అందుకుని తొలిసారిగా తిరుపతి కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన ఆయనను పలువురు అధికారులు, ఉద్యోగులు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సిఈఓ మాట్లాడుతూ, తన విజయం వెనక ఎందరో కృషి దాగి వుందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో తనకు ఎంతగానో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి సిఈఓ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ రికార్డు సాధించేలా ప్రోత్సహించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, మంత్రి సత్యకుమార్ కు, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తన 10వ సమ్మిట్ – అంతర్జాతీయ అవార్డుల ప్రదానోత్సవం యూకే పార్లమెంట్‌లోని ప్రతిష్టాత్మకమైన హౌస్ ఆఫ్ కామన్స్, ప్యాలెస్ ఆఫ్ వెస్ట్‌మిన్‌స్టర్‌లో ఘనంగా నిర్వహించిందన్నారు. ఈ విశిష్టమైన వేడుక, యూకే (యునైటెడ్ కింగ్‌డమ్), యూఎస్ఏ (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా), రష్యా, ఫ్రాన్స్, ఇటలీ, ఇండియా, నేపాల్, కజకిస్తాన్, కెనడా, మెక్సికో, పోర్చుగల్, స్పెయిన్, స్విట్జర్లాండ్, బెల్జియం, జర్మనీ, ఈజిప్ట్, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, పోలాండ్, జపాన్, ఆస్ట్రేలియా, మారిషస్ దేశాల నుండి వచ్చిన అత్యుత్తమ వ్యక్తులు, సంస్థలను సత్కరించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ప్రజా సేవ, దౌత్యం, వ్యాపార రంగాలలో రాణించిన వారిని కీర్తించిందన్నారు.

ఈ వేడుకలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) సంస్థ సిఈఓ సంతోష్ శుక్లా, రాజేష్ శుక్ల, బ్రిటన్ పార్లమెంటు సభ్యులు గరేత్ బకాన్, వీరేంద్ర శర్మ, మిస్ ఇంగ్లాండ్ లిమిటెడ్ డైరెక్టర్ యాంజీ బిస్లె తదితరులు అవార్డును అందజేశారని తెలిపారు. ప్రపంచ ప్రముఖులు, క్యాబినెట్ మంత్రులు, దౌత్యవేత్తలు, విధాన రూపకర్తలు, అంతర్జాతీయ వ్యాపార నాయకులు వంటి ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరయ్యారన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుందని, విభిన్న దేశాలు, రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్న ఈ వేడుక, అర్థవంతమైన చర్చలను ప్రోత్సహించి, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నామన్నారు.

ప్రపంచ ఐక్యత, గుర్తింపు, పురోగతిని ప్రోత్సహించడంలో ఈ వేడుకల ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ సంతోష్ శుక్లా సభలో ప్రకటన చేశారన్నారు. ఈ వేడుక శ్రేష్ఠతను గౌరవించడమే కాకుండా, ప్రపంచ పరివర్తన దిశగా సామూహిక బాధ్యతను ప్రేరేపిస్తుందని ఆయన పేర్కొన్నారు. దాని అంతర్జాతీయ ప్రభావం, ఉన్నత స్థాయి భాగస్వామ్యంతో, 10వ సమ్మిట్ – అవార్డుల ప్రదానోత్సవం యూకే పార్లమెంట్ నడిబొడ్డున ఒక మైలురాయి సమావేశంగా నిలుస్తుందన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.