వనంతోపు జనహిత వాత్సల్య ఆశ్రమంలో రిటైర్డ్ జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ బడెతల శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా రూ.10 వేల విలువైన ప్రొవిజన్స్ అందజేశారు. ఆయన సతీమణి లక్ష్మీ ప్రసూన పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు పౌష్టికాహార స్నాక్స్, బాలికలకు అవసరమైన వస్తువులు పంపిణీ చేశారు. పిల్లల విద్యకు సహకరిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. అరవ పరిమళ, జీవీ పుల్లారెడ్డి, కల్పం శ్రీనివాసులు సన్మానించారు. చేజర్ల సుధాకర్రావు సేవా కార్యక్రమాలను అభినందించారు. కార్యక్రమం జీవీ సాంబశివరావు ఆధ్వర్యంలో జరిగింది. లక్ష్మీ ప్రసూన టైలరింగ్, ఎంబ్రాయిడరీ శిక్షణ ఇస్తానన్నారు.


