ఆత్మకూరు
ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది మరియు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు దాత శ్రీ రాపూరు వెంకట సుబ్బారెడ్డి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమంలో పాల్గొని ప్రజా సేవలో భాగస్వామ్యం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.ఆర్టీసీ అధికారుల ఆహ్వానం మేరకు మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, కార్మికులు, ఆత్మకూరు పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానికులు పాల్గొన్నారు.ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయని, ఇటువంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించలని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.దాత శ్రీ రాపూరు వెంకట సుబ్బారెడ్డి సేవాభావానికి హృదయపూర్వక అభినందనలు.



