తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఎన్టీఆర్ పింఛన్ భరోసా’ పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని చిట్వేల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాకర్ల నాగార్జున నాయుడు పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని మార్గోపల్లి, మైలపల్లి గ్రామ పంచాయతీల్లో ఆయన సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను అందజేశారు.ఈ సందర్భంగా నాగార్జున నాయుడు మాట్లాడుతూ.. వృద్ధులు, వితంతువుల కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వారు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో పింఛన్ మొత్తాన్ని రూ. 4,000 కు పెంచారని కొనియాడారు. “ఒకటో తేదీనే, అది కూడా లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి అధికారులు పింఛన్ సొమ్మును అందజేయడం శుభపరిణామం. గత ప్రభుత్వంలో పింఛన్ కోసం గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలిగాయి” అని ఆయన స్పష్టం చేశారు.తమ గుమ్మం వద్దకే వచ్చి రూ. 4 వేల పింఛన్ అందజేయడం పట్ల వృద్ధులు, వితంతువులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బాలు రామాంజనేయులు, క్లస్టర్ ఇంచార్జ్ వెంకటేష్ రాజు, కో-క్లస్టర్ ఇంచార్జ్ కట్టా గిరిబాబు పాల్గొన్నారు.మార్గోపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు సుదీర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దేరంగుల భాను ప్రకాష్, చిట్వేల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు పగడాల వెంకటేష్, స్కూల్ కమిటీ చైర్మన్ శంకర్ రాజు మరియు సచివాలయ సిబ్బంది విజయలక్ష్మి, కిరణ్, శివకుమార్, సువర్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు భరోసా కల్పించారు.

అవ్వాతాతల ముంగిటకే ‘ఎన్టీఆర్ పింఛన్ భరోసా’!
తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఎన్టీఆర్ పింఛన్ భరోసా’ పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని చిట్వేల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాకర్ల నాగార్జున నాయుడు పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని మార్గోపల్లి, మైలపల్లి గ్రామ పంచాయతీల్లో ఆయన సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను అందజేశారు.ఈ సందర్భంగా నాగార్జున నాయుడు మాట్లాడుతూ.. వృద్ధులు, వితంతువుల కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వారు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో పింఛన్ మొత్తాన్ని రూ. 4,000 కు పెంచారని కొనియాడారు. “ఒకటో తేదీనే, అది కూడా లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి అధికారులు పింఛన్ సొమ్మును అందజేయడం శుభపరిణామం. గత ప్రభుత్వంలో పింఛన్ కోసం గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలిగాయి” అని ఆయన స్పష్టం చేశారు.తమ గుమ్మం వద్దకే వచ్చి రూ. 4 వేల పింఛన్ అందజేయడం పట్ల వృద్ధులు, వితంతువులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బాలు రామాంజనేయులు, క్లస్టర్ ఇంచార్జ్ వెంకటేష్ రాజు, కో-క్లస్టర్ ఇంచార్జ్ కట్టా గిరిబాబు పాల్గొన్నారు.మార్గోపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు సుదీర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దేరంగుల భాను ప్రకాష్, చిట్వేల్ గ్రామ కమిటీ అధ్యక్షుడు పగడాల వెంకటేష్, స్కూల్ కమిటీ చైర్మన్ శంకర్ రాజు మరియు సచివాలయ సిబ్బంది విజయలక్ష్మి, కిరణ్, శివకుమార్, సువర్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు భరోసా కల్పించారు.

