తిరుపతి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు పెద్ద తిమింగలాన్ని బోనులో బంధించారు. జిల్లా మత్స్యశాఖ అధికారిగా పనిచేస్తున్న నెల్లూరు రెడ్డయ్య అనే అధికారి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు.
ఒక లబ్ధిదారునికి చేపల పెంపకం కోసం ప్రభుత్వం నుంచి రూ. 50 లక్షల రుణం (Loan) మంజూరైంది. అయితే, ఈ లోన్ క్లియర్ చేయాలంటే తనకు రూ. 6 లక్షల భారీ మొత్తాన్ని లంచంగా ఇవ్వాలని రెడ్డయ్య డిమాండ్ చేశారు. చివరకు రూ. 3 లక్షలు ఇచ్చేందుకు లబ్ధిదారుడు అంగీకరించి, ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పథకం ప్రకారం అధికారులు నిఘా పెట్టగా, బాధితుడి నుంచి రూ. 3 లక్షల నగదు తీసుకుంటుండగా రెడ్డయ్యను ఏసీబీ బృందం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది
కడపలో సోదాలు.. అవినీతి తిమింగలం గుట్టు రట్టు!
ఈ అవినీతి అధికారి అరెస్ట్ అనంతరం ఏసీబీ అధికారులు తమ తనిఖీలను మరింత వేగవంతం చేశారు. నెల్లూరు రెడ్డయ్యకు చెందిన కడపలోని నివాసంలో అధికారులు ఏకకాలంలో సోదాలు (Raids) ప్రారంభించారు. ఆయన అక్రమంగా కూడబెట్టిన ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, కీలక పత్రాల కోసం ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాల్సిన సామాన్యులను పీడించి, లక్షల్లో లంచాలు డిమాండ్ చేసే ఇలాంటి “లంచగొండి తిమింగలాలు” ఇంకా ఎంతమంది ఉన్నారనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ దాడితో ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.



