శ్రీ కాళహస్తి, జులై 04 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం, పెద్ద కన్నలి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కన్నలి భాస్కర్ రెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురై, ప్రస్తుతం కోలుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి స్వయంగా భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్ళారు. వారి ఆరోగ్య పరిస్థితిని అత్యంత ఆప్యాయంగా అడిగి తెలుసుకున్న ఆయన, త్వరగా పూర్తి ఆరోగ్యంతో నిలదొక్కుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ పరామర్శ కార్యక్రమంలో తొట్టంబేడు మండల ప్రెసిడెంట్ డాక్టర్ కోగిల సుబ్రహ్మణ్యం, కాపిరెడ్డి ఢిల్లీ బాబు రెడ్డి, తొట్టంబేడు మాజీ పీఏసీఎస్ చైర్మన్ మణి నాయుడు, కోవి చంద్రయ్య నాయుడు, గంగాధరం, దీపక్ రెడ్డి, పెంచులయ్య తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పెద్ద కన్నలిలో వైకాపా నేతని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
శ్రీ కాళహస్తి, జులై 04 : (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం, పెద్ద కన్నలి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కన్నలి భాస్కర్ రెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురై, ప్రస్తుతం కోలుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి స్వయంగా భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్ళారు. వారి ఆరోగ్య పరిస్థితిని అత్యంత ఆప్యాయంగా అడిగి తెలుసుకున్న ఆయన, త్వరగా పూర్తి ఆరోగ్యంతో నిలదొక్కుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ పరామర్శ కార్యక్రమంలో తొట్టంబేడు మండల ప్రెసిడెంట్ డాక్టర్ కోగిల సుబ్రహ్మణ్యం, కాపిరెడ్డి ఢిల్లీ బాబు రెడ్డి, తొట్టంబేడు మాజీ పీఏసీఎస్ చైర్మన్ మణి నాయుడు, కోవి చంద్రయ్య నాయుడు, గంగాధరం, దీపక్ రెడ్డి, పెంచులయ్య తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

